News

భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

268views

2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బ‌హుమ‌తి లభించింది. జాన్‌ జోసెఫ్‌ హాప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్‌ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ వెల్లడించింది.

కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్‌ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్‌ విభాగంలో ఇద్దరికి నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్‌ఫ్రెడ్ జ‌యంతి సంద‌ర్భంగా డిసెంబర్‌ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు.