News

శ్రీవారి భక్తులకు అలర్ట్.. 9, 16న బ్రేక్ దర్శనాలు రద్దు

233views

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూలై 9,16వ తేదీలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. 16 వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

ఇదిలా ఉంటే.. తిరుమలలో నందలూరు, తాళ్ళపాక ఆలయాల బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ని ఈఓ శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం విడుదల చేశారు. అంతేకాకుండా.. ఈఓ శ్యామలరావు పోటు కార్మికులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డు తయ్యారీలో అనసరించే విధానాలను పిపిటి ద్వారా అధికారులు వివరించారు.