
242views
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో కార్యక్రమం చేపట్టనున్నారు. ఆరోజున ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాదికాలు చేపడుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను తితిదే రద్దుచేసింది.





