శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి ఏ సేవలో అయిన పాల్గొనవచ్చు. స్వామి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకు మార్చన మినహ మిగతా అన్నీ సేవలను భక్తులు శ్రీశైల టీవీ, యూట్యూబ్ చానెల్ ద్వారా వీక్షించవచ్చునని తెలిపారు.
219views
You Might Also Like
రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
8
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం...
AI సాంకేతికతతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న క్రైస్తవ సంఘాలు
30
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు....
తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
42
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు....
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
37
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం...
రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు
41
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్...
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
41
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...





