శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి ఏ సేవలో అయిన పాల్గొనవచ్చు. స్వామి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకు మార్చన మినహ మిగతా అన్నీ సేవలను భక్తులు శ్రీశైల టీవీ, యూట్యూబ్ చానెల్ ద్వారా వీక్షించవచ్చునని తెలిపారు.
240views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
21
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
35
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
38
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




