శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన ‘మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు / కళాకారిణి సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మికత, పవిత్రతను వ్యక్తపరుస్తూ కళాకృతు లను రూపొందిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శిల్ప, ఆగమ, వాస్తు అంశాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇచ్చిన సూచ నలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
225views
You Might Also Like
భగవన్నామ స్మరణ మోక్షానికి మార్గం
14
నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార...
సత్యదేవుని కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు
58
అన్నవరం రత్నగిరిపై ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ, అన్నవరం...
నాగపూర్ లో మరో జీహాద్ ఘటన.. యజమాని అరెస్ట్
64
మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం...
తాజాగా తెరపైకి ‘‘స్కూల్ జిహాద్’’
79
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అలాగే తాజాగా కార్పొరేట్ జిహాద్, మరింత తాజాగా స్కూల్ జిహాద్ తెరపైకి వచ్చింది. ఈ విషయం మహారాష్ట్ర కేంద్రంగా జరుగుతోంది. ముంబైలో...
జనయిత్రీ దివ్య ధాత్రి
( ఏప్రిల్ 22 – ధరిత్రీ దినోత్సవం ) పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భువిని ‘భూదేవి’ అంటూ పూజిస్తాం. సకల సంపదలకూ నెలవైన ధరణి వసుంధర...
నిదా ఖాన్కు షాకిచ్చిన నాసిక్ సెషన్స్ కోర్టు
54
మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర...





