శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన ‘మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు / కళాకారిణి సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మికత, పవిత్రతను వ్యక్తపరుస్తూ కళాకృతు లను రూపొందిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శిల్ప, ఆగమ, వాస్తు అంశాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇచ్చిన సూచ నలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
256views
You Might Also Like
అయోధ్య శేషావతార ఆలయ ధ్వజారోహణం..
10
అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి...
వృద్ధులకు సేవ చేయడం పవిత్రమైన బాధ్యత : భయ్యాజీ జోషి
40
కుటుంబాల్లో వున్న వృద్ధులకు సేవ చేయడం అనేది కేవలం సేవ కాదని, అదో పవిత్రమైన బాధ్యత అని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి...
బెంగళూరు వేదికగా ‘‘ విద్యా భారతి’’ అఖిల భారతీయ సమావేశాలు
31
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లింక్ ఇంటర్నేషనల్ సెంటర్ లో విద్య భారతి అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి...
కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా
34
ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన...
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం..
35
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు...
విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం
42
విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా...





