శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన ‘మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు / కళాకారిణి సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మికత, పవిత్రతను వ్యక్తపరుస్తూ కళాకృతు లను రూపొందిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శిల్ప, ఆగమ, వాస్తు అంశాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇచ్చిన సూచ నలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
277views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
21
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
35
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
38
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




