ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.
353views
You Might Also Like
జపాన్లోని ఫుజిసావా నగరంలో మసీదు నిర్మాణానికి స్థానికుల తీవ్ర వ్యతిరేకత
జపాన్లోని ఫుజిసావా నగరంలో ప్రతిపాదిత మొదటి మసీదు నిర్మాణం చుట్టూ వివాదం నెలకొంది. స్థానిక పౌరులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు....
విలువలు, సంస్కృతి పరిరక్షణ హిందూ కుటుంబ వ్యవస్థ
హిందూ ధర్మంలో కుటుంబం సమాజానికి మూలస్థంభంగా పరిగణించబడుతుంది. వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు ఇచ్చే మార్గదర్శకత్వం ద్వారా పిల్లలు నైతిక విలువలు,...
ద్వారకాతిరుమలలో గోబర్ధన్ ప్లాంటుతో వ్యర్థాల నుంచి సంపద
5
సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గోబర్ధన్ ప్లాంటు ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ దిశగా ద్వారకాతిరుమలలో...
సనాతన ధర్మంలో గోమాత
సనాతన ధర్మంలో గోమాతకు అత్యంత పూజ్యమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో ఆవును “గోమాత”గా భావించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, జీవన విధానంతో ముడిపడిన ఆధ్యాత్మిక...
బందీపురాలో భారీ ‘తిరంగా ర్యాలీ’
6
భారతదేశ సరిహద్దుల్లోని హిమగిరులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలోని అత్యంత సుందరమైన గురేజ్ వ్యాలీ సాక్షిగా, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ.....
రామకృష్ణా మిషన్ ఆధ్వర్యంలో ‘ఆత్మవికాస్–2026’ సమ్మర్ క్యాంపులు
9
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ‘ఆత్మవికాస్–2026’ సమ్మర్ క్యాంప్ను ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు....





