ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.
354views
You Might Also Like
2,500 మంది అమ్మాయిలకు కన్యాదానం చేసిన దంపతులు
కైలాస్బాపు కోటే, సుమిత్ర కోటే..! ఈ ఇద్దరూ మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన దంపతులు. వీళ్లు పుత్రికా సంతానం కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ వారికి ఆ భాగ్యం...
భావనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాలు
11
కాకినాడ జిల్లా కేంద్రం శివారు సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి...
ఖల్సా సజ్నా దివస్ వేడుకల కోసం 92 మంది భారత భక్తులకు పాక్ వీసాలు నిరాకరణ
31
పాకిస్థాన్లోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనుకున్న 92 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఖల్సా సజ్నా దివస్ వేడుకల్లో భాగంగా గురుద్వారా పంజా సాహిబ్ను దర్శించుకునేందుకు...
జపాన్లోని ఫుజిసావా నగరంలో మసీదు నిర్మాణానికి స్థానికుల తీవ్ర వ్యతిరేకత
26
జపాన్లోని ఫుజిసావా నగరంలో ప్రతిపాదిత మొదటి మసీదు నిర్మాణం చుట్టూ వివాదం నెలకొంది. స్థానిక పౌరులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు....
విలువలు, సంస్కృతి పరిరక్షణ హిందూ కుటుంబ వ్యవస్థ
హిందూ ధర్మంలో కుటుంబం సమాజానికి మూలస్థంభంగా పరిగణించబడుతుంది. వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు ఇచ్చే మార్గదర్శకత్వం ద్వారా పిల్లలు నైతిక విలువలు,...
ద్వారకాతిరుమలలో గోబర్ధన్ ప్లాంటుతో వ్యర్థాల నుంచి సంపద
36
సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గోబర్ధన్ ప్లాంటు ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ దిశగా ద్వారకాతిరుమలలో...





