ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.
384views
You Might Also Like
జల్గావ్ ‘ల్యాండ్ జిహాద్’: శ్రీ చాంగ్దేవ్ మహారాజ్ ఆలయాన్ని ఆక్రమించిన మతోన్మాదులు!
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ముక్తాయినగర్ తాలూకాలో తపతి, పూర్ణ నదుల సంగమ ప్రాంతంలో ఉన్న సుమారు 1,200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ చాంగ్దేవ్ మహారాజ్ ఆలయ...
దేశంలోని ఆలయాల కోసం ‘సనాతన సంరక్షణ మండలి’ని ఏర్పాటు చేయాలి : శంకరాచార్య సదానంద సరస్వతి
3
ఛింద్వారా (మధ్యప్రదేశ్): దేశంలోని ఆలయాల నిర్వహణ, భద్రత మరియు ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఒక స్వతంత్ర "సనాతన సంరక్షణ మండలి" లేదా ప్రత్యేక కమిటీని ఏర్పాటు...
కొండపై కార్తీక దీపం.. తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు
4
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం కొండపై దీపం వెలిగించవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ...
సింధూ నాగరికతను తామే నిజమైన వారసులం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..
60
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్కు ‘‘సింధూ నది...
నీటి నిల్వలో అపర భగీరధులు
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త...
అయోధ్య నిధుల కేసు అత్యవసర విచారణకు తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
49
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో పిల్...





