గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపందానికి దాటిచెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్తకళాకృతులకు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే, విస్తారమైన పరిధిని, వనరులను, గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆర్ధిక తోడ్పాటునందిస్తామని అన్నారు.
328views
You Might Also Like
భారతీయురాలిగా కన్నుమూయాలన్నదే నా చివరి కోరిక.. కలెక్టర్ వద్ద వృద్ధురాలు భావోద్వేగ విజ్ఞప్తి
3
సొంత ఊరిపై, మాతృభూమిపై ఉన్న మక్కువతో 94 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అరుదైన...
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
6
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ...
మానస్ సరోవర్ యాత్ర వేళ కేంద్రం అడ్వైజరీ
6
ప్రైవేటు టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీయ పౌరులను ఉద్దేశించి విదేశాంగ శాఖ అడ్వైజరీ చేసింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి...
ఆదివాసీ ప్రాంతాల్లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం.. అర్చక వృత్తివైపు గిరిజన యువత అడుగులు
11
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు వ్యవసాయం, కూలి పనులు లేదా సాధారణ ఉద్యోగాలకే పరిమితమైన గిరిజన యువత, ఇప్పుడు...
భారత ఆధ్యాత్మికత ప్రభావంతో జీవితం మారిందన్న స్లోవేనియా ఫుట్బాలర్ లుకా మిట్సెన్
8
స్లోవేనియా ఫుట్బాల్ ఆటగాడు లుకా మిట్సెన్ తన ఆటతీరుతో మైదానంలో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక కోణంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు....
బెంగాల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లకు బదులుగా శాకాహారం..
9
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లకు బదులుగా శాకాహారాన్ని అందించనున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. మధ్యాహ్న భోజన తయారీ...





