గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపందానికి దాటిచెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్తకళాకృతులకు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే, విస్తారమైన పరిధిని, వనరులను, గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆర్ధిక తోడ్పాటునందిస్తామని అన్నారు.
362views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
21
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
35
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
36
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




