షిల్లాంగ్ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ల తత్త్వం అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు’- అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని, నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను’ అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ‘ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసులో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు’ అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా.. ఆ గృహణికి విషయం బోధపడింది. అప్పటి నుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది.
279views
You Might Also Like
దేశ భక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్యాభారతి లక్ష్యం : గోవింద్ మహంత్
42
న్యూఢిల్లీ : నోయిడా కేంద్రంగా విద్యా భారతికి చెందిన అఖిల భారత ప్రచార విభాగ్, అభిలేఖాగార్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి....
కన్వర్ యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు
33
హరిద్వార్ : శ్రావణ మాసం రాగానే హరిద్వార్ భక్తి సాగరంగా మారిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివభక్తులు కావడీలతో పవిత్రమైన గంగా జలాన్ని...
విశాఖపట్నం గుడిలోవ కేంద్రంగా ’’ఆరెస్సెస్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్’’
40
విశాఖ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లోని గుడిలోవలో జరగనుంది. ఈ నెల 19 నుంచి 21...
ఉగ్రవాది లతీఫ్ భట్ సమాచారం ఇస్తే 15 లక్షలు… జమ్మూలో పోస్టర్లు
15
లష్కరే తోయబా సంస్థకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది లతీఫ్ భట్ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 22 న పోలీసు అధికారి...
విజ్ఞాన రంగంలో భారత్కు మరో గౌరవం.. హాకింగ్స్ సరసన భారత సైంటిస్ట్ దీపక్ ధర్
49
భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్ఎస్ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026...
ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు
40
మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా...





