News

పాకిస్థాన్ లో యోగా తరగతులు

57views

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా పాకిస్థాన్ లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. ఇస్లామాబాద్ రాజధాని అభివృద్ధి సంస్థ(సీడీఏ) ఇక్కడి ఎఫ్-9 పార్క్ లో ఉచిత యోగా తరగతులు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది ఇందులో చేరినట్లు ఆ సంస్థ ఫేస్ బుక్ లో ప్రకటించింది. అలాగే స్థానికులు యోగా చేస్తున్న ఫొటోలు కూడా ఆ పోస్ట్లో పెట్టింది. సీడీఏ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.