News

చేపల పేరుతో గో మాంసం రవాణా అడ్డుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు

53views

విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 80 గోమాంస బాక్సులను నల్లగొండ స్టేషన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులోని ముందు, వెనుక లగేజీ బోగీల్లో ఈ బాక్సులను గుర్తించారు. ఒక లగేజీ బోగీలో 40, మరో లగేజీ బోగీలో 40 బాక్సులను ఫిష్‌ లేబుల్‌ అంటించి సికింద్రాబాద్‌ తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో రైలును ఆపేందుకు ప్రయత్నించారు. గుంటూరులో అడ్డుకున్న శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విషయం నల్లగొండ జీఆర్పీ పోలీసులకు తెలియడంతో.. రైలు నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే తనిఖీ చేసి, గో మాంసం స్వాధీనం చేసుకున్నారు.