ఓటు స్ఫూర్తిని వందకి వంద శాతం చేసి చూపించింది జమ్మూ కాశ్మీర్ లోని ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ధడ్కాహి. ఇది ఉధంపూర్ లోకసభ పరిధిలోకి వస్తుంది. మంచు పర్వతాల్లో వుండే ఈ గ్రామంలో కేవలం 150 కుటుంబాలు మాత్రమే వుంటాయి. అయితే… అందులో ఎక్కువ కుటుంబాల్లో ఒకరు పుట్టుకతో మూగ, చెవుడు సమస్యను అనుభవిస్తున్న వారే. మొత్తంగా ఈ గ్రామంలో 84 మంది బధిరులు వున్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది చిన్నారులు. అయినా సరే… తమ వైకల్యం ఓటు వేసే ప్రక్రియలో ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే… ఈ గ్రామానికి ”సైలెంట్ విలేజె” అని పేరు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది బధిరులు వున్న కారణంగానే ఈ పేరు వచ్చింది. వారికి వైకల్యం వున్నా… దానిని తోజిరాజి ఓటు ప్రక్రియలో భాగం పంచుకున్నారు. అన్ని సౌకర్యాలు, అన్ని రకాల వసతులున్నా… ఓటింగ్ ప్రక్రియకు దూరంగా వుంటున్న వారినే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
49
You Might Also Like
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విదేశీ బహుళ జాతి కంపెనీలు
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు పెద్దలు. మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ వంటకాలలో...
ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు
52
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు....
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
40
టీటీడీ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులపై నమోదు చేసిన కేసు విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ...
టీటీడీ రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ అంగీకారం
118
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా...
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
33
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్...
మానవాళికి అమూల్య కానుక రామాయణం
రామాయణంలో వాల్మీకి మహర్షి తన దివ్య ప్రతిభతో మానవత్వ వికాసం పరాకాష్టను అందుకొన్న ఒక భవ్య చిత్రాన్ని తీర్చిదిద్దారు. విశ్వసాహిత్యంలో నిరుపమానమై, విలక్షణమైన స్వర్గసృష్టి అది. భారతీయులు...