News

తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

51views

తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి.శ్రీగంధం వనంలో చెట్లు దగ్ధమవ్వటంతో తిరుమలలో దట్టంగా పొగ అలుముకుంది.ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగటంతో వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉందని నడకదారిన దర్శనానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అన్నారు.అగ్ని ప్రమాదానికి కారణం తీవ్రమైన ఎండలే అని అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం పట్ల సిబ్బందిని అప్రమత్తం చేసిన అధికారులు ఎటువంటి ఆస్థి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.