
396views
తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జ్యోతి వెలిగించి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. జగదీప్ ధన్ఖడ్ సతీమణి సుదేష్ ధన్ఖడ్, సద్గురు జగ్గీవాసుదేవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొన్నారు. మహాశివుడి సన్నిధిలో జాగారం చేసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.



