
258views
ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా మృతి చెందాడు. పాకిస్థాన్లోని ఫైసలాబాద్ నగరంలో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి. మల్కాన్వాలాలో అజామ్కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపాయి. 26/11 పేలుళ్లతోపాటు.. 2006లో ముంబయి రైలు పేలుళ్ల వెనుకా అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబయి తాజ్హోటల్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది.





