News

హనుమాన్ జయంతి సందర్భంగా కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

253views

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పారామిలటరీ బలగాలను కోరాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హౌరా , హుగ్లీ జిల్లాల్లో శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా హింసాత్మక సంఘటనలు, ఆ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విధంగగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 144 సెక్షన్ విధించిన ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలను కూడా కోర్టు నిషేధించింది.

హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతల పటిష్టంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (UTs) కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్రాల్లో శాంతి భద్రతల నిర్వహణ, ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు, మత సామరస్యానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రామనవమి సందర్భంగా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహాలోని కొన్ని ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సలహా వచ్చింది.