తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేఖలు దుర్వినియోగం చేస్తూ.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన బీఆర్ విష్ణు రెండు రోజుల క్రిత తిరుమల వచ్చారు. ఆయన శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం చెన్నైకు చెందిన కృష్ణమూర్తి రఘురామన్, తిరుపతికి చెందిన కె.పళణి వెంకటేష్లను కలిశారు. ఆయనకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చి.. ఐదు బ్రేక్ దర్శనం టికెట్లను రూ.35వేలకు విక్రయించారు. అయితే తర్వాత మోసపోయినట్లు గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన దత్తాత్రేయ అనే భక్తుడు కూడా శ్రీవారి దర్శనం కోసం దళారి కృష్ణమూర్తి రఘురామన్ను సంప్రదించారు. రూ. 15 వేలకు 3 టిక్కెట్లను విక్రయించగా.. ఆయన కూడా మోసపోయినట్లు గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.. వారికి కోర్టు రిమాండ్ విధించింది. దర్శనం టికెట్ల కోసం దళారులను నమ్మొద్దని, మోసపోవద్దని విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సూచించారు.
123
You Might Also Like
శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే..
(ఏప్రిల్ 17 - శ్రీరామనవమి ప్రత్యేకం ) దేవుళ్లలో శ్రీరాముడి స్థానం వేరు... ఎందుకంటే నిత్యం సత్యమే పలుకుతాడు.... హిందూ మతానికి చెందిన వారే కాకుండా అన్ని...
రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో ఇస్రో పురోగతి..C-C నాజిల్ పరీక్ష సక్సెస్.
6
ఇస్రో చరిత్రలో మరో విజయం. రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో పురోగతిని సాధించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా ఈ కార్బన్ కార్బన్ నాజిల్ ను...
కిషన్గంగా ఒడ్డున దేశ విభజన తర్వాత తొలిసారిగా గంగా హారతి
6
ముఖ్యమైన సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మరో సంఘటన చోటు చేసుకుంది. కిషన్ గంగానది ఒడ్డున 75 సంవత్సరాల విరామం తర్వాత పురాతన గంగా హారతి సంప్రదాయాన్ని తిరిగి...
స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు ; గోపరాజు వెంకట అనంత శర్మ
ఆంధ్రప్రదేశ్ లోని, పశ్చిమ గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామానికి చెందిన గోపరాజు శర్మ 1941లో "బ్రిటీషు ఇండియన్ ఆర్మీ"లో "అకౌంటెంటు" గా మొదటి ఉద్యోగావకాశం చేజిక్కించుకున్నారు. బ్రిటీష్...
మావోయిస్ట్ లను ఎదిరించి తమ రామాలయాన్ని తిరిగి తెరిపించుకున్న గ్రామస్తులు
7
అది అత్యంత పురాతన రామాలయం. కానీ… ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులుగా వున్న మావోయిస్టులు తమ కార్యకలాపాల కోసం రామాలయం అడ్డొస్తోందంటూ దానిని బలవంతంగా, ప్రజలను భయభ్రాంతులకు గురి...