News

పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం

87views

ఎన్టీఆర్‌ జిల్లాలోని పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతమ్మ ఆలయ పరిధిలోని దుకాణాల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. వచ్చే నెల 5 నుంచి తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు ఉన్నాయి. దీంతో పెద్దఎత్తున సామాగ్రిని నిల్వచేయగా ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.