
418views
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్ ఈ నెల పదోతేదీన అట్లాంటాలో ‘గాంధీ పీస్ పిల్గ్రిమ్’ అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకు గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ ఆయనకు ఈ అవార్డును మార్టిన్ లూధర్ కింగ్ కేంద్రంలోని మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రదానం చేసింది.





