ArticlesNews

ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు!

136views

న్యూఢిల్లీ: లవ్ జిహాద్ అనేది అనేక స్థాయిల్లో నిశ్శబ్దం కొనసాగే సమస్య. లవ్ జిహాద్‌పై చాలా రాష్ట్రాలు కఠిన చట్టాలు చేశాయి. చాలా కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నాయి..కానీ కేసులు తగ్గడం లేదు.

రాజస్థాన్‌లో…

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముస్లిం యువకుడు అమీర్ హిందూ బాలికను ప్రేమ ఉచ్చులో బంధించి పెళ్ళి సాకుతో నాలుగు నెలల పాటు శారీరకంగా హింసించాడు. అనంతరం బాలికను తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 29, 2022న, హిందూ బాలిక ఏదో పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లి, సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, బంధువులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం హర్యానా, పంజాబ్, ఢిల్లీ మొత్తం 4 రాష్ట్రాల్లో వెతికినా ఏమీ దొరకలేదు.

దీని తరువాత, పోలీసులు స్థానిక ప్రజలను ప్రశ్నించడం ప్రారంభించారు, అందులో అమీర్ స్నేహితుడు పట్టుబడ్డాడు. బాలిక అమీర్‌తో ఉందని చెప్పడంతో పోలీసులు వెంటనే కోటకు చేరుకుని ఆ స్థలంపై దాడి చేసి అమీర్‌ను అరెస్టు చేసి, బాలికను విడిపించారు.

పెళ్ళి సాకుతో తనను అమీర్ తన వెంట తీసుకొచ్చాడని బాలిక పోలీసులకు తెలిపింది. ఆమెను ఓ గదిలో బంధించి ప్రతిరోజూ అత్యాచారం చేసేవాడు. ఆమె ప్రతిఘటించడంతో కొట్టేవాడు. అమీర్ ఇంతకుముందు కూడా చాలా మంది హిందూ యువతులను లవ్ జిహాద్‌లో ట్రాప్ చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

జాన్‌పూర్‌లో…

జౌన్‌పూర్‌కు చెందిన ఓ జిహాదీ యువకుడు రాజ్‌కోట్‌లోని ఓ బాలికను లవ్ జిహాద్‌తో ట్రాప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. బాలిక తండ్రి రాజ్‌కోట్ కోర్టులో కేసు వేయడంతో రాజ్‌కోట్ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో ముస్తఫాబాద్‌లోని నిందితుడు యువకుడి ఇంటి నుంచి బాలికను విడిపించారు. జౌన్‌పూర్ జిల్లాలోని ముస్తఫాబాద్‌కు చెందిన ముస్లిం యువకుడు రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఓ హిందూ యువతిని తన ప్రేమ వలలో బంధించాడు. జిహాదీ యువకుడు హిందువుగా వేషం వేసుకుని బాలికతో కలిసి ఆమె ఇంటి నుంచి పరారయ్యాడు. కూతురు అదృశ్యం కావడంతో ఆమె తండ్రి రాజ్‌కోట్‌లో కేసు పెట్టారు. జిహాదీ యువకుడిని అరెస్టు చేశారు.

ఉదయ్‌పూర్‌లో…

రాజస్థాన్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ హిందూ యువతిని ఉదయ్‌పూర్ ట్యాక్సీ డ్రైవర్ రాజు అలియాస్ షారుక్ ఖాన్ లవ్ జిహాద్ ఉచ్చులో బంధించాడు. ఇండోర్‌కు చెందిన బాలిక తన మహిళా స్నేహితుడితో ఉదయపూర్‌కు వచ్చింది. అక్కడ ఆమె ఒక హోటల్‌లో పనిచేస్తోంది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో ట్యాక్సీ బుక్ చేస్తున్న సమయంలో షారుక్‌తో పరిచయం ఏర్పడింది.

షారుక్ తన పేరు రాజు అని వెల్లడించాడు. ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఐదు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. తర్వాత అంతా బాగానే ఉందని, అయితే దీపావళి సందర్భంగా షారుఖ్ మొబైల్‌కి అతని మొదటి భార్య నుంచి కాల్ వచ్చిందని ఆ అమ్మాయి చెప్పింది. యాదృచ్ఛికంగా హిందూ యువతి ఫోన్ తీయగా, రాజు అసలు పేరు షారుఖ్ అని, అతనికి పెళ్లి మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమెకు తెలిసింది. దీని తరువాత, అమ్మాయి విచారించగా, షారుక్ లవ్‌ జీహాద్‌ బట్టబయలైంది. తర్వాత, షారుక్ అమ్మాయిని మతం మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో బాలిక ఇండోర్‌కు వెళ్లి తన కుటుంబ సభ్యులకు జరిగిన మొత్తం ఘటనను వివరించి పోలీసులను కూడా ఆశ్రయించింది. పోలీసుల సూచన మేరకు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బాలిక ఉదయపూర్ నుండి ఇండోర్‌కు షారుక్‌ను పిలిపించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి