News

మాడుగులలో ఘనంగా భూలోకమాత, భవానీ దీక్షాధారణ

303views

మాడుగుల: ఏపీలోని అనకాపల్లి జిల్లా,మాడుగుల గదబూరు గ్రామంలో పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం గ్రామ దేవత శ్రీ బూలోకమ్మ అమ్మవారి దీక్ష ఘనంగా జరిగింది. గ్రామంలో కొలువు తీరిన బూలోకమ్మ అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పౌర్ణమి రోజు అమ్మ వారి మాలధారణ చేయడం ఇక్కడి ఆచారం. అయితే, ఈ ఏడాది కూడా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ బూలోకమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్మకం. వేకువ జాము నుండి అమ్మవారి ఆలయంలో దీక్షలు ధరించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి భజన గీతాలు పాడి వారి భక్తిభావాన్ని చాటుకున్నారు. అనంతర మధ్యాహ్నం భారీ అన్న సమారాధన చేపట్టారు. గ్రామంలో భక్తులంతా దీక్షలు ధరించడంతో ఊరు ప్రత్యేక శోభ సంతరించుకుంది.

భవానీ దీక్షలు…

మాడుగులలో శ్రీ దుర్గాభవానీ అమ్మవారి మాల ధారణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమయింది. పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం వేకువ జామున భక్తులు అమ్మ వారి మాలలు ధరించారు. శ్రీ దేవి తల్లి ఆలయంలో గురు భవాని ఖండేపల్లి కొండబాబు చేతుల మీదుగా అలాగే శ్రీ దుర్గ తల్లి ఆలయంలో గురు భవాని చప్పా రమణ అధ్వర్యంలో అలాగే జగ్గన చావిడి వద్ద గురు భవాని దర్మిశెట్టి నాయుడు చేతులు మీదుగా ఈ మాలలు ధరించారు. నలభై రెండు రోజులు పాటు ఈ దీక్షలు ధరించి ఆఖరు రోజు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దీక్షను విరమింపచేయనున్నారు. గతంలో కంటే అధిక శాతం మాలలు ధరించడంతో గ్రామంలో భవాని దీక్షదారులతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జై దుర్గ జై జై దుర్గ నామ స్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి