
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొజికోడ్ జిల్లాకు చెందిన కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే దోహ వెళ్లాడు. అక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్లో బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడిపై అధికారులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. మలద్వారంలో నాలుగు క్యాప్సుల్స్ రూపంలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ముంబయిలో …
మహారాష్ట్రలోని ముంబయిలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 11,12 తేదీల్లో చేపట్టిన సోదాల్లో సీజ్ చేసి బంగారం సుమారు 7.87 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో రెండు ఘటనలో రూ.22 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. ఈ ఘటన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Source: EtvBharat





