News

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్

419views

న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్​లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు లలిత్​. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ళ కింద‌ట ఈయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి