
-
విగ్రహాలు ధ్వంసం
-
గణేష్ మందిరంలో దోపిడీ
-
కాళీ మందిరంపై బైబిల్ రాతలు
-
నిప్పులు చెరిగిన హిందువులు
ట్రినిడాడ్: ప్రపంచవ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి సంబరాలు నిర్వహించుకుంటున్న వేళ కరీబియన్ గడ్డపై క్రైస్తవ మతోన్మాదులు బరితెగించారు. మతం మత్తులో చెలరేగిపోయారు.
ట్రినిడాడ్లో ఈ వారం రెండు హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలు ద్వీపంలోని కూవా, పెనాల్ పట్టణాలలో ఉన్నాయి.
కిందటి నెల 28న, కూవాలోని కార్లీ బేలోని కాళీమాత ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి అపవిత్రం చేశారు. విధ్వంసకులు రాత్రి ఆలయంలోకి చొరబడి కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి ఆలివ్ ఆయిల్ కూడా పూశారు. అంతేకాదు, నిందితులు ఆలయ గోడలపై బైబిల్లోని రాతలు రాశారు. అందులో క్రైస్తవేతరులకు వ్యతిరేకంగా హెచ్చరిక ఉంది. వారు ఆలయ బయటి గోడలపై పెద్ద ఎరుపు అక్షరాలతో ‘నిర్గమకాండము 20:3-4 చదవండి’ అని రాశారు.
ఎక్సోడస్ అనేది పవిత్ర బైబిల్లోని ఒక పుస్తకం. ఆ పుస్తకంలోని 20వ అధ్యాయంలో, 3వ వచనంలో, “నాకు తప్ప వేరే దేవుళ్ళు ఉండకూడదు” అని చెప్పబడింది. అదే అధ్యాయంలోని 4వ వచనం ఇలా చెబుతోంది, “పైన స్వర్గంలో లేదా క్రింద భూమిపై లేదా దిగువ నీటిలో ఉన్న దేని రూపంలోనూ మీరు ఒక ప్రతిమను తయారు చేసుకోకూడదు.”
దీన్నిబట్టి కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు ఆలయంపై దాడి చేసినట్టు స్పష్టమవుతోంది.
దుర్గా దేవి నవరాత్రి సేవలను ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిన తర్వాత…
దుర్గా దేవి నవరాత్రి సేవలను ముగించుకుని ఆలయ సభ్యులు తమ ఇళ్ళకు బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగిందని పండిట్ సత్యానంద్ మహరాజ్ తెలిపారు. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కానీ, రశీదు ఇవ్వలేదు అని చెప్పారు.
ఇదిలావుండగా, ఈ ఘటనపై అక్కడి హిందువులు నిప్పులు చెరిగారు. చెల్లాచెదురుగా ఉన్న ఆలయంలోని పూజాసామగ్రిని సరిచేశారు. భక్తిగీతాలు ఆలపించడంతో ఆలయంలో పూజలు కొనసాగాయి. చాలా మంది సాధారణ భక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించినందున విగ్రహాన్ని ధ్వంసం చేయడం చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు.
సెప్టెంబరు 22 రాత్రి పెనాల్లోని గణేష్ మందిరాన్ని ధ్వంసం చేసిన వారం తర్వాత కూవాలోని కాళీ ఆలయంపై దాడి జరిగింది. ఒక గణేష్ మూర్తిని పగలగొట్టి, ఇతర మూర్తుల నుండి బట్టలు తీసి, సిగరెట్ పీకను వదిలిపెట్టినట్టు గుర్తించారు. విధ్వంసకుడు ఆలయంలోని ఫ్రిజ్లో ఉంచిన పాలు కూడా తాగాడు. అక్కడ ఉంచిన కొన్ని గింజలను తిన్నాడు.
$3,000 – $4,000 మధ్య విలువైన స్పీకర్ బాక్స్ కూడా దొంగిలించారు. ఆ రాత్రి CCTV ఫుటేజీలో ఒక వ్యక్తి ఆలయం నుండి స్పీకర్ బాక్స్తో రహదారి వెంట నడుస్తున్నట్టు రికార్డు అయింది.
Source: OpIndia





