
385views
మైసూర్: శరన్నవరాత్రుల్లో భాగంగా కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ అందంగా ముస్తాబైంది. వేడుకల్లో యాదువ కుటుంబ వారసుడు, యదువీర్ కృష్ణదత్త వడయార్ చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ వంశస్థులు యదు వంశ సంప్రదాయం ప్రకారం అంబావిలాస ప్యాలెస్లోని దర్బార్ హాలులో రత్నాల సింహాసనానికి పూజలు చేశారు. ఏనుగులను అధిక సంఖ్యలో కోట వద్దకు తీసుకువచ్చారు. పూజల అనంతరం గజరాజులను ఊరేగించారు. వేడుకల్లో భాగంగా ఫిరంగులను కోట వద్ద మోహరించారు. ‘అభిమన్యు’ అనే గజరాజు ఈ ఏడాది సైతం బంగారు పల్లకిని మోయనుంది. పండగ దృష్ట్యా కోటలోకి సందర్శకులకు అనుమతి నిషేధించారు.





