
388views
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. భారత్ తరఫున ద్రౌపదీ ముర్ము రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ద్రౌపదీ ముర్ము లండన్లో పర్యటించనున్నారు.





