
339views
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం. ఇక ఇపుడు అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్ ముందున్నాయని ఐఎమ్ఎఫ్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏడేళ్లలో జపాన్, జర్మనీలనూ అధిగమించి మూడో స్థానానికి భారత్ వెళ్ళవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.





