
425views
-
కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు
-
నితీష్ కుమార్కు ఎదురు దెబ్బ
మణిపూర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు మణిపూర్లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మూడింట రెండింట మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదని అన్నారు. బీజేపీలో చేరినవారిలో ఎమ్మెల్యేలు కెహెచ్ జోయ్కిషన్, ఎన్ సనాతే, మహ్మద్ అచ్చబుద్దీన్, ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్లు ఉన్నారు.





