
సహరాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని దేవ్బంద్లో హిందూ-ముస్లిం కమ్యూనిటీల మధ్య అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హిందూ మత స్థలాలు, ఇళ్ళపై స్లింగ్షాట్తో కోడిగుడ్లు, రాళ్ళు విసురుతున్నారు. హిందూ సమాజం మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే లక్ష్యంతో ఈ పని చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
అందిన సమాచారం ప్రకారం… షాబాజ్, అహ్మద్, సాదిక్, అఫ్జల్ అనే నలుగురు యువకులు దేవ్బంద్లోని ఓవర్ బ్రిడ్జిపై నిలబడి స్లింగ్షాట్పై గుడ్లు మరియు రాళ్ళు విసురుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం, నిందితులు కారు నుండి పారిపోవడం ప్రారంభించగా, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఈ గొడవలో కానిస్టేబుల్ కృష్ణగోపాల్కు గాయాలయ్యాయి. వీరిలో ఓ యువకుడు కదులుతున్న కారులో కానిస్టేబుల్ను ఈడ్చుకెళ్ళేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి.
ఎస్పీ దేహత్ సూరజ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం… నలుగురు యువకులను విచారించారు. జన్మాష్టమి ఊరేగింపు సందర్భంగా ఆగస్టు 20న తాల్హేరి చుంగి సమీపంలోని హిందూ మత స్థలాలపై కూడా గుడ్లు, రాళ్ళు విసిరినట్టు నిందితులు అంగీకరించారు.
మొహల్లా సరాయ్లోని దేవాలయాలు, సైనీ సరాయ్లోని దుకాణాలపై కూడా గుడ్లు విసిరారు. నలుగురు యువకుల రికార్డులను శోధిస్తున్నారు, వీరిలో అఫ్జల్ ఢిల్లీ నివాసి, సాదిక్ సర్సావా నివాసి. నలుగురిని జైలుకు పంపారు. నిందితుల నుంచి స్లింగ్ షాట్, 17 గుడ్లు, మూడు మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
Source: VSKBharat





