
న్యూఢిల్లీ: బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. దీంతోపాటు ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా, ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ లక్షణ్లకు అవకాశం దక్కింది.
కొత్త పార్లమెంటరీ బోర్డు
జేపీ నడ్డా , ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జతియా, కేఎల్ సంతోష్ సభ్యులుగా ఉంటారు. జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ
జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా , కేఎల్ సంతోష్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, ఓమ్ మథుర్, వనతి శ్రీనివాస్లకు చోటు కల్పించారు.
Source: Nijamtoday





