
ఢాకా: ఓ హిందూ నర్సుపై అత్యాచారం చేసిన తర్వాత ముస్లిం హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం, జూలై 11, బంగ్లాదేశ్లోని కిషోర్గంజ్ జిల్లాలోని భైరబ్ ఉపజిల్లా నుండి వెలువడింది. మృతురాలిని నార్సింగి జిల్లా రాయ్పురా ఉపజిల్లా పరిధిలోని పిరిజ్కంది గ్రామానికి చెందిన సెంతు ప్రమాణిక్ కుమార్తె రిమా ప్రమాణిక్గా గుర్తించారు.
సోమవారం ఉదయం 10 గంటలకు భైరబ్లోని యునైటెడ్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ సెంటర్ నుండి 19 ఏళ్ళ బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆసుపత్రిలో రిమా నర్సుగా ఉద్యోగం చేసేవారు. ఈ హత్యకు సంబంధించి ముస్లిం యజమాని హనీఫుర్ రెహమాన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రెహమాన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్.
స్థానిక వర్గాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీమా గత రెండేళ్ళుగా యునైటెడ్ హాస్పిటల్ అండ్ ఆర్థోపెడిక్స్ సెంటర్లో నర్సుగా పనిచేస్తోంది. జులై 7న డ్యూటీకి సెలవు తీసుకుని స్వగ్రామానికి వెళ్ళింది. జూలై 9న రిమా ఆసుపత్రి అధికారుల నుండి కాల్ అందుకున్న తర్వాత ఆసుపత్రికి తిరిగి వచ్చిందని పోలీసులు, మీడియా వర్గాలు కూడా తెలిపాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆమె మృతదేహం ఆసుపత్రి బెడ్పై పడి ఉంది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
“రీమాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. తన కొత్త అసైన్మెంట్లో చేరడానికి నర్సింగ్ హోమ్ అథారిటీకి రాజీనామా సమర్పించింది. కానీ, నర్సింగ్ హోమ్ అథారిటీ కొన్ని కారణాల వల్ల ఆమెను పిలిచింది. చివరికి రీమా విగతజీవిగా మారింది’ అని ‘మందిర్ టీవీ’ అని పిలువబడే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ నివేదించింది.
హిందూ నర్సులపై లైంగిక వేధింపులు
నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ హనీఫుర్ రెహమాన్ తన నర్సింగ్హోమ్లో హిందూ యువతులకు ఉపాధి కల్పించిన తర్వాత వారిపై లైంగికంగా వేధిస్తున్నాడని స్థానిక వర్గాలు నొక్కి చెబుతున్నాయి. కాగా, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత శవపరీక్ష కోసం కిషోర్గంజ్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి పంపినట్టు భైరబ్ పోలీస్ స్టేషన్లోని అధికారి గోలం మోస్తఫా తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లోని హిందువులకు హక్కులు లేదా సెక్యూరిటీలు లేవు. రాజకీయ పార్టీలు కూడా షరియా ఏజెంట్లుగా పనిచేస్తూ హిందువుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.





