News

‘అగ్నిపథ్‌’లో కులప్రాధాన్యత ఉండ‌దు… అవ‌న్నీ పుకార్లు!

405views

న్యూఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్​ఎస్​ఎస్​కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్​ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ళ‌ తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు.

సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్​ సర్టిఫికెట్​ ఎందుకని ప్రశ్నించారు. అగ్నిపథ్​ నియామకాల్లో కులం, మతానికి సంబంధించి ధ్రువపత్రం అడగడంపై ప్రతిపక్షాలు ఈ విధంగా స్పందించాయి.

ఈ విషయంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్.. ఇవన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. ఈ సైనిక నియామక ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతోందని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. బీజేపీ ప్రతినిధి సంబిత్​ పాత్ర ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు.

నియామక ప్రక్రియపై వస్తున్న విమర్శలు సైన్యాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. యువతను నిరసనలకు దిగేలా రెచ్చగొట్టేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి