363
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల నాలుగోతేదీన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9.20 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి 10.10 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.50 గంటలకు ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకోనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సభ అనంతరం విజయవాడ చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు.
Source: EtvBharat