News

పాకిస్థాన్ లో చైనా జాతీయులే లక్ష్యంగా దాడులు

360views

* చైనీయులకు రక్షణ కల్పించడానికి నానా తంటాలు పడుతున్న పాక్ భద్రతా దళాలు

పాకిస్థాన్ ‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్‌ పోలీసులకు తెలియజేయాలని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్‌ ఫారిన్‌ సెక్యూరిటీ సెల్‌ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇస్లామాబాద్ ‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్‌ డాలర్ల చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్ ‌(సీపెక్‌) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ షటిల్ వ్యాన్ ‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్థాన్ ‌లోని బులిచిస్థాన్‌ ప్రావిన్స్ ‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.