
396views
-
ప్రకటనలు ప్రచురించవద్దని ప్రింట్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్ట విరుద్ధమని పేర్కొంది. వీటిని వినియోగిస్తున్న వారికి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్లైన్ మీడియాల్లో ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్స్ ప్రకటనలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు సూచనలు చేసినట్టు పేర్కొంది.





