
473views
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘పీఎం శ్రీ స్కూల్స్’ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. నూతన జాతీయ విద్యావిధానంపై గుజరాత్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ పాఠశాలలను నూతన విద్యావిధానానికి ప్రయోగశాలగా అభివర్ణించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 తమలో విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని. విద్యా రంగంలోని లోపాలు సరిదిద్దుకుని.. వ్యవస్థను పటిష్ఠ పరిచి నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసిందని గుర్తుచేశారు.





