
458views
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్నారు. బెర్లిన్ లో ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
అంతే కాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్ – గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్ కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీకి ఇదే తొలి విదేశీ టూర్. చివరగా గతేడాది నవంబర్లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.