
571views
అంబేద్కర్ నగర్(ఉత్తరప్రదేశ్): పోలీసుల బుల్డోజర్ చర్యకు భయపడి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలివి. 2022 మార్చి 29న జైత్పూర్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జియులీ గ్రామంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఐదుగురు నిందితులు బుల్డోజర్ హెచ్చరికలు, బుల్లెట్లకు, అంబేద్కర్ నగర్ పోలీసుల వేగవంతమైన చర్యలకు భయపడి జైత్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారని అంబేద్కర్ నగర్ పోలీసులు ట్వీట్ చేశారు.
అంతకుముందు, నిందితులను ధ్రువీకరించికున్న తర్వాత నిందితులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా లొంగిపోవాలని, లేనిపక్షంలో ఇళ్ళను బుల్డోజర్ కూల్చివేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Source: Organiser





