
676views
-
ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్
-
ప్రధాన మంత్రికి లేఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా బుర్ఖాను ధరించకుండా చూడాలని న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. లౌకిక సంస్థల్లో ఇలాంటి వస్త్రధారణకు అనుమతులు ఉండవని పేర్కొంది.
కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు విద్యా సంస్థల్లో లౌకికత్వాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కోరింది. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్కూల్ యూనిఫాంలు ధరించాలేలా చూడాలని పేర్కొంది. తద్వారా భారత లౌకిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.





