News

భారత జలాల్లోకి పాకిస్తాన్‌ బోట్లు

480views

గుజ‌రాత్‌: భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్తాన్‌​ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్​లోని కచ్​ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్​ ఆపరేషన్​లో అధికారులు ఈ బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయ‌న్న‌ విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బోటుకు సంబంధించిన వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన చెట్లు ఉండటం, అలలు తీవ్రంగా ఉండటం వల్ల సైనికులకు గాలింపు చర్యలు చేపట్టడం సవాల్​గా మారింద‌ని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి