
-
ప్లాట్ఫారమ్-5లో రూపుకోల్పోయిన పోర్టర్స్ రెస్ట్ రూమ్
-
పదేళ్ళ కిందటే భారీ స్థాయిలో మార్పు
-
ప్రజల ఆస్తిని ఆక్రమించిన ముస్లింలు
-
హిందూ కార్యకర్తల నిరసన ప్రదర్శన, రైల్వే శాఖకు ఫిర్యాదు
బెంగళూరు: బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్లోని ప్రభుత్వ ఆస్తులను మసీదుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కే.ఎస్.ఆర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్-5లో పోర్టర్స్ రెస్ట్రూమ్ను చట్టవిరుద్ధంగా మసీదుగా మార్చారనే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ప్రజా ఆస్తులను ఆక్రమించి మసీదుగా మార్చడంపై తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, భారతీయ రైల్వేలను కోరారు. అన్ని వర్గాలకు చెందిన కూలీల కోసం విశ్రాంతి గదిని నిర్మించారు.
అయితే, ఆ గదిని పదేళ్ళ క్రితమే మసీదుగా మార్చేశారు. ఇతర మతాలకు చెందిన సభ్యులు ఈ గదిని సందర్శించకుండా నిషేధించారు. ఈ మసీదును మస్జిద్-ఎ-నూరానీ అని పిలుస్తారు. కాగా, ఈ వీడియోలు రాష్ట్రంలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ప్రభుత్వ ఆస్తులను మసీదుగా అక్రమంగా మార్చడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హిందూ జనజాగృతి వేదిక సభ్యులు పోర్టర్ల గదులను అక్రమంగా మసీదుగా మార్చడానికి అనుమతించినందుకు నైరుతి రైల్వే అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హిందూ జనజాగృతి కార్యకర్తలు అక్రమ మసీదులోకి ప్రవేశించారు. రైల్వే అధికారులు అక్రమ మసీదును మూసివేయాలని వివిధ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.
Hello @AshwiniVaishnaw @RailMinIndia, It looks like the porters restroom on Platform No. 6 of Bengaluru Railway station has been converted to a Masjid! Is it true and if yes, can you pls take needful action?@ShobhaBJP @Tejasvi_Surya pic.twitter.com/Uc1cMSXlwg
— നചികേതസ് (@nach1keta) January 30, 2022
హిందూ కార్యకర్తలు ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తూ నైరుతి రైల్వే అధికారులకు లేఖ రాశారు. ప్లాట్ఫారమ్ నంబర్ 5 వద్ద అనధికారిక ప్రార్థన స్థలంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ కార్యకర్తలు అధికారులను కోరారు. కార్మికుల విశ్రాంతి గదిని ప్రార్థనా స్థలంగా మార్చడం ఖండించదగిన విషయమని హిందూ జనజాగరణ వేదిక కార్యకర్తలు లేఖలో పేర్కొన్నారు. “బెంగళూరు కే.ఎస్.ఆర్ రైల్వే స్టేషన్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన స్టేషన్. రైల్వే స్టేషన్ చుట్టూ అనేక మసీదులు ఉన్నప్పటికీ, ప్లాట్ఫారమ్పై ప్రార్థనలకు అనుమతి ఇవ్వడం కుట్రగా అనిపిస్తోంది” అని లేఖలో తెలిపారు.
బహిరంగ స్థలాలను మసీదులుగా మార్చడంలో కుట్ర: హిందూ కార్యకర్తలు
ప్రభుత్వ ఆస్తులను ప్రార్థనా స్థలంగా మార్చేందుకు ఓ వర్గం కుట్ర పన్నిందని, ఈ స్థలాన్ని మసీదుగా మార్చాలని డిమాండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బెంగళూరు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అధికారులు 2018లో బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ నుండి పశ్చిమ బెంగాల్కు చెందిన ఆదిల్ అసదుల్లాను అరెస్టు చేశారు.
2019లో, బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతం నుండి ఒక ఉగ్రవాది మహమ్మద్ అక్రమ్ను ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కాటన్పేట్ మసీదులో దాక్కున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ సభ్యుడు బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు” అని హిందూ కార్యకర్తలు తెలిపారు. అనధికార ప్రార్థనా స్థలానికి అనుమతించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ కార్యకర్తలు లేఖలో హెచ్చరించారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





