
-
ఎవ్వరికీ చెప్పొద్దని అల్లా, ఖురాన్పై ప్రమాణం
-
నిందితుడి పేరు జమాల్ అహ్మద్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో ఓ మసీదుకు చెందిన ఇమామ్ ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడైన ఇమామ్ పేరు జమాల్ అహ్మద్ అని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. నిందితుడు ఇమామ్ వయస్సు 52 ఏళ్ళు. అతను సుమారు పదేళ్ళుగా కిస్ని గ్రామంలోని మసీదులో ఇమామ్గా ఉన్నాడు. గ్రామంలోని పిల్లలకు ఇస్లాం బోధిస్తూ వస్తున్నాడు.
బాధితురాలు తన చెల్లెలితో కలిసి అదే మసీదుకు చదువుకునేందుకు వెళ్ళేది. ఘటన జరిగిన రోజు చిన్నారి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఆమె తీరు సరిగా లేకపోవడం, ఆరోగ్యం బాగోలేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని అడగడంతో చిన్నారి ఏడుపు ప్రారంభించింది. బాధితురాలి ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతూ ఉండడాన్ని గమనించారు.
జమాల్ అహ్మద్ బాధితురాలిని చదువు చెప్పిస్తాననే నెపంతో బాలికను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి బట్టలు విప్పమని అడిగాడు. నిందితుడు తన బట్టలు కూడా తీశాడు. బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రైవేట్ భాగాల్లో రక్తం రావడం, పాప ఏడవడం ప్రారంభించడంతో, నిందితుడు అల్లా, ఖురాన్పై ప్రమాణం చేసి బాలిక నోరు మూయించాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, రోజూలాగే చదవడానికి రావాలని చెప్పాడు. బాధితురాలు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాకి చెందిన వాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Source: Nijamtoday





