
600views
-
లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ
న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్ సింగ్ 355వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు మోదీ.
ఈమేరకు గతంలో పట్నాలో గురుగోవింద్ సింగ్కు నివాళులు అర్పించిన ఫోటోలను షేర్ చేశారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. గురు జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుంది.
355వ ప్రకాశ్ పురబ్ను ఘనంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని మోడీ తెలిపారు. ప్రకాశ్ పురబ్ను పురస్కరించుకుని దిల్లీలోని గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ మందిరానికి తరలివస్తున్నారు. అటు పంజాబ్, అమృత్సర్లోని స్వర్ణదేవాలయానికీ భక్తుల తాకిడి పెరిగింది.





