News

లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు

367views
  • ఖలిస్థాన్ ఉగ్రవాదుల భాగస్వామ్యం పై జర్మనీలో విచారణ

లుథియానా: పంజాబ్​లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని జర్మనీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు సిఖ్​ ఫర్​ జస్టిస్​కు​ చెందిన జస్వీందర్​ సింగ్​ ముల్తానీగా గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్​ చేసినట్టు అధికారులు వెల్లడించారు. జస్వీందర్​కు కోర్టు పేలుడుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పేలుడులో మృతిచెందిన నిందితుడు గగన్​దీప్​ వద్ద ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.

జస్వీందర్​పై ఇప్పటికే పంజాబ్​లో రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. భారత అధికారుల సమాచారం ఆధారంగా జర్మన్​ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పేలుడుకు ఖలీస్థానీ ఉగ్రవాదులకు సంబంధంపై అధికారులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి