న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్ కుప్వారాలోని తీత్వాల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్స్పీకర్ల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాం.
LOC पर अवैध कंस्ट्रक्शन कर रहे पाकिस्तानियों को भारतीय सेना ने रोका
तीतवाल इलाके में LOC पर निर्माण देखने के बाद स्थानीय ने भारतीय सेना के अधिकारी को जानकारी दी। जिसके बाद भारतीय सेना ने पाकिस्तानी रेंजर्स के निर्माण कार्य को लाउडस्पीकर के जरिए इस अवैध निर्माण को रोकने के लिए कहा pic.twitter.com/Ph5KL8EShG— Ritam | ऋतम् (@TheRitamApp) December 22, 2021
పాక్ నిర్మాణాలు చేపట్టిన ప్రదేశం భారత భూభాగానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది” అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. దీంతో పాక్ నిర్మాణపనులను నిలిపివేసిందని సదరు అధికారి తెలిపారు. అయితే.. పాక్ ఈ ప్రాంతంలో వేటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోందో తెలియదని చెప్పారు. నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఓసీ వెంబడి ఇరుపక్షాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.