
-
రూ. 10 లక్షల కట్నం డిమాండ్
-
అంతలోనే తెలిసిపోయిన అసలు సంగతి
-
నిత్యపెళ్ళికొడుకుని పీటలపైనే బాదేసిన వధువు బంధువులు
లక్నో: ముజమ్మిల్ హుసైన్… దొంగ పెళ్ళికొడుకు! పైగా… అక్షరాల పది లక్షల రూపాయల కట్నంను డిమాండ్ చేశారు. దీంతో వధువు బంధువులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ షాక్నుంచి తేరుకొనేలోపే అసలు బండారం బయటపడింది. వరుడు ఒక దొంగ పెళ్ళికొడుకని! ఇంతకుముందే ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడని! ఇంకేముంది… మాంచి కాకమీద ఉన్న వధువు తరుఫు వాళ్ళు.. పెళ్ళి లేదు గిళ్ళి లేదు.. కట్నం లేదు… కానుకలు లేవని ఆ పీటలపైనే వరుడిని ఒక పట్టు పట్టారు. గేప్ లేకుండా చితకబాదేశారు… ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన నిందితుడు ముజమ్మిల్ హుసైన్కు దిల్లీకి చెందిన యువతితో పెళ్ళి నిశ్చయమైంది. గాజియాబాద్ జిల్లా మోహన్నగర్లో శుక్రవారం వివాహ వేడుకలను నిర్వహించారు. మరికాసేపట్లో పెళ్ళి అనగా రూ.10 లక్షల కట్నం అడిగారు హుసైన్ తరఫు వారు. అదే సమయంలో వధువు కుటుంబీకులకు హుసైన్కు ఇదివరకే వివాహం జరిగిందన్న విషయం తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన వధువు తరపు వారు పెళ్ళికొడుకుపై దాడికి దిగారు.
సమాచారం అందుకుని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుసైన్ పెళ్ళి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన అతడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు.
Source: EtvBharat





