News

కన్నుమూసిన బీజేపీ భీష్ముడు

831views

దక్షిణ కన్నడ: దక్షిణ కన్నడ జిల్లా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ భీష్మగా పేరొందిన కె. రామభట్ కన్నుమూశారు. విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రామభట్ పుత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 92 ఏళ్లు. 1977లో జనసంఘ్ అభ్యర్థిగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దక్షిణ కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో అడ్వానీతో కలిసి జైలుకెళ్లారు. పుత్తూర్ మహాలింగేశ్వర దేవాలయం ట్రస్టీగా సేవలందించారు. ‘‘జనసంఘ్, బీజేపీ చరిత్రలో కె. రామ భట్ జీ వంటి దిగ్గజాలకు ప్రత్యేక స్థానం ఉంది. కర్నాటకలో పార్టీ బలోపేతానికి ఆయన పట్టుదలతో పనిచేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి