News

హర్యానాలో పెరుగుతున్న యువతుల హత్యలు!

552views

హర్యానా: ‘మేము రాత్రి 11.30 గంటలకు శివాలయం దగ్గరకు చేరుకున్నప్పుడు, చాలా సేపు మమ్మల్ని వెంబ‌డించిన ఇన్నోవా, మా వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి, మా దారిని అడ్డుకుంది. ఇన్నోవాలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌లతో కారు నుండి దిగి తాళాలు అడిగారు. కారు డోర్‌ తెరిచేందుకు కారు తాళాలు సునీల్‌ నుంచి తీసుకుని తనిష్కపై పలుసార్లు కాల్పులు జరిపారు.

సునీల్‌ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లి, గాలిలోకి కాల్పులు జరిపి పారిపోయారు. తనిష్కను రోప్‌ాతక్‌లోని పీజీఐఎంఎస్‌లో చేర్చారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉంది’ వరుడు మోహన్‌ వివరించినట్టు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

భలి-ఆనంద్‌పూర్‌ గ్రామానికి చెందిన మోహన్‌కు సంప్లా గ్రామానికి చెందిన తనిష్క శర్మతో ఈ నెల ఒకటోతేదీన వివాహం జరిగింది. దంపతులు ఇంటికి వెళుతుండగా భలి-ఆనంద్‌పూర్‌ గ్రామంలో పై ఘటన చోటుచేసుకుంది. మోహన్‌ సోదరుడు సునీల్‌ కారు నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మహ్మద్‌ సాహిల్‌ కోసం హర్యానా పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన గురువారం(డిసెంబర్‌ 2) జరిగింది. తనిష్క పెళ్లికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సాహిల్‌కు అందజేస్తున్న ఇద్దరు మైనర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు.

ఇదిలావుండగా, హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇటువంటి సంఘటనే గతంలో జరిగింది. నికితా (21) అనే మహిళను గత ఏడాది అక్టోబర్‌ 26న పట్టపగలు తౌసెఫ్‌, రెహాన్‌లు హత్య చేశారు. ఎ బి. కామ్‌. చివరి సంవత్సరం విద్యార్థిని ఆమె. పరీక్షలు రాసిన తర్వాత కళాశాల నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఆమెను అడ్డగించారు. తౌసెఫ్‌, రెహాన్‌ మొదట ఆమెను కారులో అపహరించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించడంతో తౌసెఫ్‌ ఆమెపై కాల్పులు జరిపాడు.

కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. తౌసేఫ్‌ పేరుమోసిన రాజకీయ కుటుంబానికి చెందినవాడు. కిరాతకుల దుశ్చర్య అంతా కెమెరాలో రికార్డయింది. కోర్టు ఈ ఏడాది మార్చిలో నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా, హర్యానాలో రోజు రోజుకు పెరుగుపోతున్న ముస్లింల దాడుల వల్ల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి