News

పసుపు మాఫీయాపై అసోం సర్కారు ఉక్కుపాదం!

599views
  • నజ్రుల్‌ ఇసాల్మ్‌, అనువార్‌ హుస్సేన్‌ అరెస్టు

  • వేల ఎకరాల అటవీ భూమి స్వాధీనం

  • ఆక్రమదారులను తరిమికొట్టిన పోలీసులు

  • వచ్చే నెల 15లోగా పూర్తిగా ఖాళీ చేయాలని హుకుం

గౌహతి: అసోంలో వేలాది హెక్టార్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. వలస వచ్చిన ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఈ అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసోం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ధాల్‌పూర్‌, గోరుఖుతిలో భారీ ఆక్రమణలను తొలగించింది. శిక్షణ పొందిన దుర్మార్గులు పోలీసు బలగాలపై కూడా దాడి చేసి డ్యూటీలో ఉన్న 11 మంది పోలీసు సిబ్బందిని గాయపరచడంతో ధాల్పూర్‌లో తొలగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారింది.

గౌహతి హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ఎనిమిదోతేదీన అసోం ప్రభుత్వం లుమ్‌డిరగ్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని వేల ఎకరాల భూముల్లోని ఆక్రమణలను తొలగించింది. అసోంలోని వివిధ జిల్లాల నుండి వలస వచ్చిన వేలాది ముస్లిం కుటుంబాలు లుండిరగ్‌లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో దాదాపు 1400 హెక్టార్ల భూమిని ఆక్రమించుకున్నాయి.

కొందరు మాఫియాలు వ్యాపార అవసరాల కోసం అటవీ భూమిని క్రమపద్ధతిలో ఆక్రమిస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్‌ హిమంత బిస్వా శర్మ వెల్లడిరచారు. ఒక దశాబ్దానికి పైగా, ఒక నజ్రుల్‌ ఇస్లాం అలియాస్‌ బాబర్‌ భాయ్‌, అతని భాగస్వామి అనువార్‌ హుస్సేన్‌ వందల ఎకరాల అటవీ భూమిని క్రమపద్ధతిలో ఆక్రమించారు. పసుపు సాగు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది కుటుంబాలను తీసుకువచ్చారు.

ఈ భూ మాఫియాలు 500 ఎకరాలకు పైగా అటవీ భూమిలో పసుపు సాగు చేస్తూ ఏటా 25 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్టును ఆక్రమించిన కుటుంబాలు భూమి లేని వారేనని చెప్పాలి. ఈ వ్యక్తులకు ఇతర రాష్ట్రాల్లో భూమి, ఆస్తులు ఉన్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారు. హోజాయ్‌ జిల్లా నఖుతి ప్రాంతానికి చెందిన ల్యాండ్‌ మాఫియా నజ్రుల్‌ ఇసాల్మ్‌ అలియాస్‌ బాబర్‌ భాయ్‌, అనువార్‌ హుస్సేన్‌లను అసోం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

నజ్రుల్‌ అరెస్టు తర్వాత, అటవీ భూమిని ఆక్రమించడం ద్వారా భూ మాఫియాలు నడుపుతున్న పసుపు సిండికేట్‌ను పోలీసులు ఛేదించగలరని హోజాయ్‌లోని పోలీసు వర్గాలు తెలిపాయి. 2007 నుండి పసుపు సాగు కోసం ల్యాండ్‌ మాఫియా నజ్రుల్‌, అతని కంపెనీ తీసుకువచ్చిన 1000 కంటే ఎక్కువ వలస ముస్లిం కుటుంబాలను లుమ్డింగ్‌ అడవి నుండి తరిమికొట్టారు.

మరోవైపు, బర్చాలా, ధేకియాజులి నియోజకవర్గాల్లోని వందలాది మంది ఆక్రమణదారుల కుటుంబాలకు అసోం ప్రభుత్వం నోటీసులు అందజేసింది. వివిధ రాష్ట్రాల జిల్లాల నుండి వలస వచ్చిన ఈ ముస్లిం కుటుంబాలు రెండు నియోజకవర్గాల్లోని నదీతీర ప్రాంతాలను(చార్‌) ఆక్రమించుకున్నాయి. ఈ నియోజకవర్గాల జనాభాను మార్చే ముప్పునూ ఈ వ్యక్తులు సృష్టించారు. డిసెంబర్‌ 15లోగా ఆక్రమణదారులను చార్‌ నుండి వదిలివేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి