News

ఢిల్లీకి కాలుష్యం పోటు!

518views
  • వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు

  • హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి కాలుష్యం పోటు తగులుతోంది. తక్షణం అక్కడి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం కావడంతో కాలుష్యంతో మిళితమైన పొగమంచు నగరాన్ని కప్పివేస్తోంది.

గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌(జీఆర్‌ఏపీ) ప్రత్యేక ప్యానెల్‌ ఇప్పటికే ‘అవుట్‌డోర్‌ యాక్టివిటీస్‌’ని పరిమితం చేయాలని సూచించింది. వాహనాల వినియోగాన్ని కనీసం 30 శాతం ‘తగ్గించాలని’ పేర్కొంది. నిన్న శుక్రవారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 500 స్కేల్‌లో ఈ సీజన్‌లో అత్యధికంగా 471కి చేరుకుందని, అందువల్ల ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, ప్రైవేట్‌ పౌరులు అప్రమత్తం కావాల్సివుంది.

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ద్వారా ‘తీవ్ర’ కేటగిరీలో గాలి నాణ్యత సూచిక(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఎక్యూఐ) ఎగువ స్థాయికి చేరుకుంది. ఈ రీడింగ్‌ 2020 నవంబర్‌ అయిదోతేదీన నమోదైన 462 కంటే దారుణంగా ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ‘అత్యవసర చర్యలు’ తీసుకోవాల్సివుంది. నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయడం, ప్రైవేట్‌ వాహనాల కోసం సరి-బేసి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశంపై కూడా ఆంక్షలు ఉండవచ్చు. గురువారం ఏక్యూఐ రీడిరడ్‌ 411గా ఉన్నట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, నగరానికి చుట్టపక్కల నాలుగువేల వ్యవసాయ మంటలు సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల నుండి విడుదలయ్యే కాలుష్య కారకాల వల్ల యమునా నది కూడా కాలుష్యం బారిన ప‌డింది. రోజు రోజుకూ కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో పొట్టచేత కాల్చడం వంటి వాటిపై చర్చించేందుకు దేశ రాజధానికి పొరుగున ఉన్న రాష్ట్రాల పర్యావరణ మంత్రులందరితో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఇటీవల సూచించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి