
552views
భాగ్యనగరం: హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్వీపీఎన్ఏలో 132 మంది ఐపీఎస్లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్లు ఉన్నారు.





